మౌంట్ మౌంగనుయి: బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నది. టెస్టు క్రికెట్లో వరల్డ్ చాంపియన్ న్యూజిలాండ్కు షాక్ ఇచ్చింది. మౌంట్ మంగనుయిలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కివీస్పై బంగ్లాదేశ్ విక్టరీ సాధించింది. కేవలం 40 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని అందుకున్నది. కివీస్ను స్వంత గడ్డపై బంగ్లాదేశ్ ఓడించడం ఓ అద్భుతం. దీంతో 2 టెస్టుల సిరీస్లో బంగ్లా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. బంగ్లా బౌలర్ ఇబాదత్ హుస్సేన్ తన బౌలింగ్తో మెరుపులు మెరిపించాడు. రెండవ ఇన్నింగ్స్లో 46 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడతను. దీంతో న్యూజిలాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో కేవలం 169 రన్స్కు ఆలౌట్ అయ్యింది. ఇటీవల వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ను నెగ్గిన న్యూజిలాండ్ ర్యాంకింగ్లో తొమ్మిదవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. స్వంత గడ్డపై 16 టెస్టుల తర్వాత న్యూజిలాండ్ తొలిసారి ఓడిపోయింది.
స్కోరు బోర్డు
న్యూజిలాండ్ 328 & 169
బంగ్లాదేశ్ 458 & 42/2