లాహోర్: మెహది హసన్ మిరాజ్ (112; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హుసేన్ శాంటో (104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో కదంతొక్కడంతో.. ఆసియాకప్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పోరులో బంగ్లా 89 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది.
అఫ్గాన్ బౌలర్లు రెండు వికెట్లే పడగొట్టగా.. ముగ్గురు బంగ్లా బ్యాటర్లు రనౌట్గా వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (75), హష్మతుల్లా షాహిది (51) పోరాడినా ఫలితం లేకపోయింది. బంగ్లా బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, షరీఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు పడగొట్టారు.