ఢాకా : స్వదేశంలో పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ సంచలన విజయంతో సత్తాచాటింది. సొంతగడ్డపై టెస్టుల్లో ఇంతవరకూ పాక్ను ఓడించని ఆ జట్టు.. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో గెలిచి చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది.
బంగ్లా నిర్దేశించిన 268 పరుగుల ఛేదనలో పాక్.. 163 రన్స్కే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. నహీద్ రాణా (5/40) ఐదు వికెట్లతో విజృంభించగా తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.