ఢాకా: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై సిరీస్ క్వీన్స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. అదే జోరులో ఐర్లాండ్పై 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 10 వికెట్లతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో పరుగుల పరంగా అతిపెద్ద (183) విజయాన్ని నమోదు చేసుకున్న బంగ్లా.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి పది వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 101 పరుగులకు ఆలౌటైంది. హసన్ మహమూద్ (5/32), తస్కీన్ అహ్మద్ (3/26) ధాటికి ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనను బంగ్లా 13.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 102 రన్స్ చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (41*), లిటన్ దాస్ (50*) రాణించారు. హసన్ మహమూద్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ముష్ఫికర్ రహీమ్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.