ఢాకా : బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రస్సెల్ డొమింగో తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టు వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు ఉండగా.. ఏడాది ముందే కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. బంగ్లా హెడ్కోచ్గా 2019లో కోచ్గా నియామకమయ్యాడు. డొమింగో కోచింగ్లో బంగ్లాదేశ్ చివరిసారిగా టీండియాతో ఆడిన 2-0తో సిరీస్ను కోల్పోయింది. దాదాపు సిరీస్లో టీండియాను బంగ్లాదేశ్ ఒడించినంత పని చేసింది. సిరీస్ తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డ్ ఆపరేషన్స్ హెడ్ జలాల్ యూనస్ పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంలో ‘మాకు జట్టుపై ప్రభావం చూపగల కోచ్ అవసరం. తమకు కోచ్ కావాలని, మెంటర్ కాదు’ కామెంట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలపై డొమింగో ఆగ్రహానికి రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. లేఖను పంపిన వెంటనే బంగ్లా బోర్డు డొమింగో రాజీనామా బోర్డు ఆమోదించింది. రస్సెల్ సార్థ్యంలో బంగ్లా జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లను కైవసం చేసుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్లో మొదటిసారి టెస్ట్ మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, భారత్లపై వన్డే సిరీస్లను గెలుచుకుంది. ఇంతకు ముందు డొమింగో టీ20 కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించి.. శ్రీధరన్ శ్రీరామ్కు అప్పగించారు. మార్చిలోగా కొత్త కోచ్ను నియమించనున్నది. మార్చిలో ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్లో ఆడనున్నది. కొత్త కోచ్గా శ్రీలంకకు చెందిన చండికా హతురుసింఘే ఎంపికయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.