ధర్మశాల: ఆల్రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (57; 3/25) అటు బ్యాట్తో ఇటు బాల్తో దుమ్మురేపడంతో.. వరల్డ్కప్లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (47) ఒక్కడే కాస్త పోరాడగా.. మహమ్మద్ నబి (6), రషీద్ ఖాన్ (9), కెప్టెన్ హష్మతుల్లా (18) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. నజ్ముల్ హసన్ షాంటో (59 నాటౌట్), మెహదీ హసన్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్హక్, నవీన్, అజ్మతుల్లా తలా ఒక వికెట్ పడగొట్టారు. మిరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.