సిల్హెట్: పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లా..రెండో టెస్టుపై మరింత పట్టు బిగించింది. 437 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు మంగళవారం బరిలోకి దిగిన పాక్..7 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వికెట్కీపర్ మహమ్మద్ రిజ్వాన్(75 నాటౌట్), సాజిద్ఖాన్(8 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
చేతిలో మూడు వికెట్లు ఉన్న పాక్..విజయానికి 121 పరుగుల దూరంలో ఉంది. రిజ్వాన్తో పాటు కెప్టెన్ షాన్ మసూద్(71), సల్మాన్ ఆగా(71) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రిజ్వాన్ సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఆగాతో కలిసి ఆరో వికెట్కు 134 పరుగుల విలువైన భాగస్వామ్నాన్ని నెలకొల్పాడు. తైజుల్ ఇస్లాం(4/113) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన పాక్ను రిజ్వాన్ ఆదుకున్నాడు. మరో రోజు మిగిలి ఉన్న మ్యాచ్లో మూడు వికెట్లు తీస్తే..టెస్టు సిరీస్ బంగ్లా వశమైనట్లే.