Srilanka | ఛటోగ్రామ్: బంగ్లాదేశ్తో ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక విజయానికి 3 వికెట్ల దూరంలో నిలిచింది. 511 పరుగుల భారీ ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 67 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఐదో రోజు ఆ జట్టు గెలవాలంటే మరో 243 పరుగులు చేయాల్సి ఉంది. మెహదీ హసన్ మిరాజ్ (44 నాటౌట్), తైజుల్ ఇస్లాం (10 నాటౌట్) క్రీజులో ఉన్నారు.