BAN vs IND : రెండో టెస్టులో భారత్ మ్యాచ్పై పట్టు సాధిస్తోంది. మూడో రోజు ఆఖరి సెషనల్ భారత బౌలర్లు చెలరేగడంతో బంగ్లా 231 రన్స్కే పరిమితమైంది. దాంతో రెండో ఇన్నింగ్స్లో భారత్కు 145 పరుగుల టార్గెట్ విధించింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీశాడు. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ జకిర్ హసన్ (51), లిట్టన్ దాస్లు (73) హాఫ్ సెంచరీతో రాణించారు. అతనికి నురుల్ హసన్ (31) , తస్కిన్ అహ్మద్ (31) సహకారం అందించారు. లిట్టన్, నురుల్ జోడీ 41 పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. అక్షర్ బౌలింగ్లో నురుల్ను రిషభ్ పంత్ స్టంప్ అవుట్ చేశాడు.
రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఉనాద్కత్, ఉమేశ్ యాదవ్కు చెరో వికెట్ దక్కింది. మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 87 పరుగుల ఆధిక్యం లభించింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడడంతో టీమిండియా 314 పరుగులు చేసింది. మొదటి టెస్టులో గెలిచిన భారత్ 1-0తో సిరీస్లో ముందంజలో ఉంది.