మిర్పూర్: రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తుది టెస్ట్లో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగింది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా మరో భారీ విజయం కన్నేసింది. మిర్పూర్లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేల్ రాహుల్ నేతృత్వంలో టీమ్ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొదటి టెస్ట్లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్ స్థానంలో జైదేవ్ ఉనద్కత్ను జట్టులోకి తీసుకున్నది.
ఇక బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. బ్యాటర్ యాసిల్ అలీ స్థానంలో మొమినుల్ హక్ను, బౌలర్ ఇబాదత్ హొస్సైన్ ప్లేస్లో టస్కిన్ అహ్మద్ను తుది టీమ్లోకి తీసుకున్నది. కాగా, మొదటి టెస్ట్లో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే దూకుడును రెండో టెస్టులో కంటిన్యూ చేసి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తున్నది.