కురవి, నవంబర్ 4: రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న క్రీడాపోటీల్లో బాలానగర్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అన్ని క్రీడల్లో సత్తాచాటిన బాలానగర్ అథ్లెట్లు 117 పాయింట్లతో ట్రోఫీ కైవసం చేసుకున్నారు. టోర్నీ చివరి రోజు జరిగిన అండర్-19 బాలికల కబడ్డీ ఫైనల్లో ఎల్లారెడ్డిపేటపై సీరోలు గెలుపొందింది. బాలుర విభాగంలో నార్నూర్పై బాలానగర్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ‘ఈఎంఆర్ఎస్’ ముగింపు వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, గురుకులాల సెక్రటరీ రోనాల్డ్ రాస్ విజేతలకు బహమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏకలవ్య గురుకుల విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, ఐటీడీఏ పీవో అంకిత్, అభిలాష తదితరులు పాల్గొన్నారు.