Bajrang Punia : కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)ను భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతిస్తున్నారు. బ్రిజ్ భూషణ్(Brij Bhushan) సన్నిహితుడు సంజయ్ సింగ్(Sanjay Singh) అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేసిన ఒలింపిక్ విజేత భజ్రంగ్ పూనియా(Bajrang Punia).. తన అవార్డును తిరిగి స్వీకరిస్తానని తెలిపాడు.
‘మేము రాజకీయ పావులుగా మారామని, హర్యానా.. ఉత్తరప్రదేశ్ ఇలా ప్రాంతాల వారీగా విడిపోయామని కొందరు విమర్శిస్తున్నారు. మేము దేశం కోసం రక్తం, చెమటను చిందించాం. కానీ, బ్రిజ్ భూషణ్ అనుచరులు మమ్మల్ని దేశ ద్రోహులు పిలుస్తున్నారు. అసలు వాళ్లెవరూ మమ్మల్ని, మా దేశ భక్తిని శంకించడానికి. అప్పుడు, ఇప్పుడు మా నిర్ణయం ఒక్కటే. బ్రిజ్ భూషణ్ బృందం భారత రెజ్లింగ్ సమాఖ్యకు దూరంగా ఉండాలి’ అని భజ్రంగ్ అన్నాడు.
బ్రిజ్ భూషణ్, సంజయ్ సింగ్
రెజ్జింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ డిసెంబర్ 21న గెలుపొందాడు. అతడి విజయానికి నిరసనగా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) తాను ఇక కుస్తీని వదిలేస్తున్నానని కన్నీటి పర్యంతమైంది. ఒలింపిక్ విజేత భజ్రంగ్ పూనియా(Bajran Punia) తన పద్మశ్రీ అవార్డును ఢిల్లీలోని కర్తవ్య పథ్లోని పాదచారులు వెళ్లే దారిలో వదిలేశాడు. . మరో రెజ్లర్ వీరేందర్ సింగ్ తన పద్మ శ్రీ అవార్డును వదులుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన సమాఖ్యపై వేటు వేసింది.
భజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్
కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్యను ఆదివారం భారత క్రీడా మంత్రిత్వ(Sports Ministry) శాఖ రద్దు చేసింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం క్రీడా శాఖను సంప్రదించకుండానే సంజయ్ జాతీయ స్థాయి అండర్ -15, అండర్-20 రెజ్లింగ్ పోటీలు ఉత్తరప్రదేశ్లో జరుగుతాయని ప్రకటించాడు. దాంతో సంజయ్.. జాతీయ క్రీడా నిబంధనలను ఉల్లంఘించారని అతడి బృందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు తదుపరి ప్రకటన వెల్లడించేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది.