Badminton Asia Team Championships 2024 | మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. అమ్మాయిలు చైనా గండాన్ని దాటినా అబ్బాయిలు మాత్రం దాటలేకపోయారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమి పాలైంది. మంగళవారం 4-1 తేడాతో హాంకాంగ్ను ఓడించిన భారత్.. క్వార్టర్స్లో మాత్రం కీలక ఆటగాళ్లు దూరమవడంతో ఓటమి పాలైంది.
ఐదు మ్యాచ్లు (మూడు సింగిల్స్, రెండు డబుల్స్) గా సాగే ఈ ఈవెంట్లో తొలి మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్.. 6-21, 21-18, 21-19 తేడాతో వెంగ్ హాంగ్ యంగ్ను ఓడించాడు. మరో సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా.. 21-11, 21-16 తేడాతో లె లాన్ జి ని చిత్తు చేశాడు. కానీ డబుల్స్లో భారత్ చిరాగ్ శెట్టి, సాత్విక్ జోడీని పక్కనబెట్టి సూరజ్ గోలా – పృథ్వి కృష్ణమూర్తిలతో బరిలోకి దిగింది. ఈ జోడీ.. 13-21, 9-21 తేడాతో రెన్ జియాంగ్ యు – జి హామ్ నాన్ చేతిలో ఓడిపోయింది. మరో డబుల్స్లో ఎం.ఆర్. అర్జున్ – ధృవ్ కపిల ద్వయం.. 15-21, 21-19, 21-19 తేడాతో చెన్ బొ యంగ్ – లి యి చేతిలో పరాభవాన్ని ఎదుర్కుంది.
Just in: India go down to China 2-3 in Group stage tie of Badminton Asia Team Championships (Men).
Prannoy & Lakshya won their respective Singles matches.Worth mentioning that India had already booked a spot in QF by winning against Hong Kong yesterday. #BATC2024 pic.twitter.com/y3CK7U86np
— India_AllSports (@India_AllSports) February 15, 2024
రెండు సింగిల్స్ భారత్ గెలువగా రెండు డబుల్స్ మ్యాచ్లు చైనా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కీలకమైన మూడో సింగిల్స్లో భారత్.. కిదాంబి శ్రీకాంత్ను కాకుండా చిరాగ్ సెన్తో బరిలోకి దిగింది. అయితే నిర్ణయాత్మక పోరులో చిరాగ్.. 15-21, 16-21 తేడాతో వాంగ్ జెంగ్ జింగ్ చేతిలో ఓడిపోయాడు. దీంతో భారత్ క్వార్టర్స్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. పురుషుల కథ ముగియడంతో గురువారం మహిళలు ఏం చేస్తారో చూడాలి. పీవీ సింధు సారథ్యంలోని భారత మహిళల జట్టు.. శుక్రవారం హాంకాంగ్తో పోటీ పడనుంది.