హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పండిస్తోంది. గతంలో కంటే ఈ ఏషియాడ్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. దాంతో ఇప్పవరకు భారత్ ఖాతాలో ఈ ఏషియాడ్ పతకాల సంఖ్య 52కు చేరింది. అందులో 13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు ఉన్నాయి.
తాజాగా మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్లో సుతీర్థ ముఖర్జి, ఐహిక ముఖర్జిలతో కూడిన ఇండియన్ టీమ్ కాంస్య పతకం సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల టీటీ డబుల్స్లో భారత్కు కాంస్య పతకం రావడం ఇదే తొలిసారి. సోమవారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన చా సుయోంగ్, పాక్ సుగ్యోంగ్ జోడి చేతిలో భారత్ పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.
Many congratulations to Ayhika and Sutirtha Mukherjee on winning the #BronzeMedal in the Women’s Doubles Table Tennis event.
Let’s #Cheer4india 🇮🇳 #WeAreTeamIndia | #IndiaAtAG22 pic.twitter.com/b2naWrLQoe
— Team India (@WeAreTeamIndia) October 2, 2023