IND vs AUS : సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. స్పిన్నర్లు బిష్ణోయ్, అక్షర్ పటేల్ పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు తీశారు. మొదట జోష్ ఫిలిప్పే(8)ను బిష్ణోయ్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్(31)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ వెంటనే అరోన్ హర్డీ(8)ని అక్షర్ బౌల్డ్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం టిమ్ డేవిడ్(14), బెన్ మెక్డెర్మాట్(10) ఆడుతున్నారు. ఆసీస్ వజియానికి ఇంకా పరుగులు కావాలి. 10 ఓవర్లకు స్కోర్ 76/3.
రాయ్చూర్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు కొట్టింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో రింకూ సింగ్(46 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. టాపార్డర్లో రుతురాజ్ గైక్వాడ్(32), యశస్వీ జైస్వాల్(37 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ మూడు, బెహ్రెన్డార్ఫ్ రెండు వికెట్లు తీశారు.