పుణె: గత మ్యాచ్లో మ్యాక్స్వెల్ మెరుపు డబుల్ సెంచరీతో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. శనివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ దక్కించుకున్న ఆసీస్.. చివరి మ్యాచ్లోనూ గెలిచి నాకౌట్ ముందు ఆత్మవిశ్వాసం ప్రొది చేసుకోవాలని చూస్తుంటే.. ఆఖరి మ్యాచ్లోనైనా నెగ్గి టోర్నీని విజయంతో ముగించాలని బంగ్లా భావిస్తున్నది.
టోర్నీ ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్ల్లో మినహాయిస్తే.. వరుసగా ఆరు మ్యాచ్లు నెగ్గిన కంగారూలకు.. రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సేవలు కోల్పోయిన బంగ్లా ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉండటంతో.. దానికి ముందు తమ అస్త్రశస్ర్తాలను పరీక్షించుకునేందుకు బంగ్లా మ్యాచ్ను వినియోగించుకోవాలని ఆసీస్ ఆటగాళ్లు యోచిస్తున్నారు.