దుబాయ్: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఇండియా ఆడుతోంది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియన్ జట్టులో బుమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చారు. ఫైనల్ 12 జట్టులో వరున్ చక్రవర్తికి అవకాశం కల్పించారు. ఇంగ్లండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఫస్ట్ వార్మప్ మ్యాచ్ మిస్సైన రోహిత్.. ఇవాళ్టి మ్యాచ్లో కీలకం కానున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా .. ఇక నుంచి బౌలింగ్ కూడా చేయనున్నట్లు చెప్పాడు. టీ20 వరల్డ్కప్కు ముందే అతను బౌలింగ్ను స్టార్ట్ చేయనున్నట్లు రోహిత్ వెల్లడించాడు. ఆసీస్తో మ్యాచ్కు షమికి కూడా రెస్ట్ ఇచ్చారు. అయితే తుది జట్టులో లేని విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు.