న్యూఢిల్లీ : కుటుంబ సభ్యులకు అస్వస్థత కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్వదేశానికి పయనమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో తక్కిన రెండు టెస్టులకు కమిన్స్ అందుబాటులో ఉండగలడని జట్టు యాజమాన్యం తెలిపింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మూడు రోజులలోనే ముగియడంతో కమిన్స్ వెంటనే స్వదేశానికి వెళ్లిపోయాడు. మూడో టెస్టు ఇండోర్లో మార్చి 1న ప్రారంభం కానున్నది. తొలి రెండు టెస్టులు గెలిచిన టీమ్ ఇండియా సిరీస్లో తిరుగులేని స్థితిలో నిలిచింది. టెస్టు సిరీస్ అనంతరం ఇరు జట్లు మార్చి 17నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి.