మెల్బోర్న్: ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (152), డేవిడ్ వార్నర్ (106) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 221 పరుగుల తేడాతో గెలిచింది. ఇటీవల ఆసీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్.. కంగారూలతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైంది.
ఆసాంతం సత్తాచాటిన ఆసీస్ 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు నిర్ణీత 48 ఓవర్లలో 5 వికెట్లకు 355 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 142 రన్స్కే ఆలౌటైంది. జాసన్ రాయ్ (33) టాప్ స్కోరర్ కాగా.. ఆసీస్ బౌలర్లలో జంపా 4, కమిన్స్, అబాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.