Australia : భారత్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో వరుస ఓటములు చవిచూస్తున్న ఆస్ట్రేలియా(Australia)కు మరో షాక్. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20కి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. వరల్డ్ కప్ జట్టులోని ఆరుగురు స్వదేశానికి బయలుదేరనున్నారు. స్టీవ్ స్మిత్(Steve Smith), ఆడం జంపా(Adam Zampa) మంగళవారమే ఆసీస్కు వెళ్తుండగా.. మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, సియాన్ అబాట్లు మ్యాచ్ తర్వాత బుధవారం ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నారు.
దాంతో, ఆఖరి రెండు టీ20లకు మంగళవారం ఆస్ట్రేలియా క్రికెట్ స్క్వాడ్ను ప్రకటించింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో నెగ్గి 2-0 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన సిరీస్పై నజర్ వేసింది. గువాహటిలోని బర్సపర స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
🚨 JUST IN: Australia have made a host of changes to their squad for the final three T20I matches against India 👀
Details 👇https://t.co/8gitTQvNL0
— ICC (@ICC) November 28, 2023
ఆస్ట్రేలియా స్క్వాడ్ : మాథ్యూ వేడ్(కెప్టెన్), టిమ్ డేవిడ్, బెహ్రన్డార్ఫ్, తన్వీర్ సంగా, కేన్ రిచర్డ్సన్, బెన్ డ్వార్షుస్, నాథ్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, అరోన్ హర్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్డెర్మాట్, జోష్ ఫిలిప్పే.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు కంగారూలను హడలెత్తిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువకులతో నిండిన టీమిండియా రెండు టీ20ల్లో ఆసీస్ను చిత్తుగా ఓడించింది. వైజాగ్లో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి గెలుపొందిన భారత్.. తిరువనంతపురంలో ఇరదీసింది. యువకెరటాలు యశస్వీ జైస్వాల్(53), రుతురాజ్ గైక్వాడ్(58), ఇషాన్ కిషన్(52), రింకూ సింగ్(31 నాటౌట్)కు చెలరేగడంతో 235 పరుగులు చేసింది. కొండంత ఛేదనలో ఆసీస్ 191కే పరిమితమైంది.