నాగపూర్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆసీస్ బ్యాటర్లను త్వరత్వరగా ఔట్ చేసి.. ఆ మ్యాచ్పై ఇండియాకు పట్టు ఉండేలా చేశాడు. 20 ఓవర్లు వేసిన జడేజా 40 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా.. షమీ, సిరాజ్లకు చెరో వికెట్ దక్కింది.
That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith's defence! 👌👌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3
— BCCI (@BCCI) February 9, 2023
ఇవాళ ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే ఆరంభంలోనే వార్నర్, ఖవాజా వికెట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. సిరాజ్, షమీలు ఆ వికెట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఇక ఆ తర్వాత మూడవ వికెట్కు లబుషేన్, స్మిత్లు కీలక భాగస్వామ్యం అందించారు. కానీ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు.
A brilliant session for #TeamIndia 💪💪
Four wickets for @imjadeja & two wickets for @ashwinravi99 in the afternoon session as Australia are 174/8 at Tea on Day 1 of the 1st Test.
Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/MWJLQV6qUC
— BCCI (@BCCI) February 9, 2023
లబుషేన్ 49 రన్స్, స్మిత్ 37 రన్స్ చేసి ఔటయ్యాడు. రెండవ సెషన్లో జడేజా ఆసీస్ బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మధ్యాహ్నం తర్వాత స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్ను జడేజా సమయోచితంగా వాడుకున్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్కు రెండు వికెట్లు దక్కాయి. ఆసీస్ ఇన్నింగ్స్లో కేరీ 36 రన్స్ చేసి ఔటయ్యాడు. పీటర్ హ్యాండ్స్కూంబ్ 28 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు.