దుబాయ్: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఇండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఆ వికెట్లు తీశారు. వరుసగా రెండు బంతుల్లో అశ్విన్ ఇద్దర్ని ఔట్ చేశారు. ఆస్ట్రేలియా 7 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 38 రన్స్ చేసింది. స్మిత్, మ్యాక్స్వెల్లు క్రీజ్లో ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియన్ జట్టులో కోహ్లీ, బుమ్రా, షమిలకు రెస్ట్ ఇచ్చారు.