ఆరు వికెట్లతో బొలాండ్ విజృంభణ
మూడో టెస్టులో ఇంగ్లండ్ చిత్తు మోగించింది. ఓవర్నైట్ స్కోరు 31/4తో మంగళ
వారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్..
మెల్బోర్న్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 3-0తో గెలుచుకుంది. రెండున్నర రోజుల్లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఓవర్నైట్ స్కోరు 31/4తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (28), బెన్ స్టోక్స్ (11) మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ స్కాట్ బొలాండ్ 7 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 267 పరుగులు చేసిన విషయం తెలిసిందే. బొలాండ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరోవైపు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ సపోర్ట్ స్టాఫ్లో కరోనా కేసులు వెలుగు చూడగా.. మ్యాచ్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆటగాళ్లందరికీ నెగెటివ్ వచ్చింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 185,
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 267, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 68 ఆలౌట్ (జో రూట్ 28; బొలాండ్ 6/7, స్టార్క్ 3/29).