శ్రీలంకలో పర్యటనకు సిద్ధమైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్గా ఇటీవల పగ్గాలు అందుకున్న ఆండ్రూ మెక్డొనాల్డ్కు కరోనా సోకింది. శ్రీలంక వెళ్లే జట్టు సభ్యులందరికీ చేసిన కరోనా పరీక్షల్లో ఆండ్రూకు పాజిటివ్ వచ్చింది. దాంతో అతన్ని ఏడు రోజులపాటు ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆండ్రూ అసిస్టెంట్మైకేల్ డి వెనుటో.. ఆస్ట్రేలియా జట్టు కోచ్గా బాధ్యతలు చేపడతాడని తెలుస్తోంది.
కొలంబోలో జరిగే రెండో టీ20 ప్రారంభమయ్యేసరికి ఆండ్రూ కోలుకుంటాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా చేసిన తర్వాత ఆండ్రూను మధ్యంతర కోచ్గా నియమించారు. ఆ తర్వాత అతన్నే కోచ్గా ప్రకటించడం జరిగింది. అలాగే న్యూజిల్యాండ్ మాజీ సారధి డానియల్ వెట్టోరీ కూడా అసిస్టెంట్ కోచ్గా ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నాడు.