India vs Australia | చెన్నైలోని చెపాక్(Chepauk) స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య నేడు కీలకమైన మూడో వన్డే (3rd ODI) జరుగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. చెరోటి గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ సమమైన సిరీస్లో ఆఖరి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన స్మిత్ (captain smith) సేన బ్యాటింగ్ ఎంచుకుని భారత జట్టు(Teamindia)కు బౌలింగ్ అప్పగించింది. ఇక దాదాపు మూడేండ్ల తర్వాత చిదంబరం స్టేడియంలో( MA Chidambaram Stadium) మ్యాచ్ జరుగుతుండడంతో.. ఈ మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
తుది జట్లు
భారత్: రోహిత్, శుభ్మన్, కోహ్లి, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, షమి, సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
Australia have won the toss and chosen to bat in the decider at Chepauk 🏏#INDvAUS | 📝: https://t.co/1TO8TYwH93 pic.twitter.com/P0ewmwwVY9
— ICC (@ICC) March 22, 2023
బ్యాటింగ్పైనే నజర్:
భారత బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి నెలకొన్నది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో స్టార్క్ పేస్ ధాటికి సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగిన టీమ్ఇండియా బ్యాటర్లు చెన్నైలో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో సున్నాలు చుట్టడం ఒకింత ఆందోళన కల్గిస్తున్నది. టీ20 ఫార్మాట్లో వినూత్న షాట్లతో ఇరుగదీసే సూర్య..వన్డేల్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సూర్య వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే టాపార్డర్లో శుభ్మన్ గిల్, రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నా..పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. ఆసీస్ పేసర్లు స్వింగ్ బౌలింగ్తో ఇబ్బందులకు గురిచేస్తున్నా..దీటుగా సమాధానమివ్వడంలో విఫలమవుతున్నారు. సంప్రదాయక స్పిన్కు చిరునామా అయిన చెన్నై పిచ్ స్పందించే దానిపై మన బ్యాటింగ్ తీరు ఆధారపడి ఉంది. స్పిన్ గాకుండా పేస్కు సహకరిస్తే..మరోమారు భారత్కు కంగారూ పేసర్ల నుంచి కష్టాలు తప్పకపోవచ్చు.