బ్రిస్బేన్: సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు సెమీస్ దిశగా అడుగులు వేస్తున్నది. గ్రూప్-1లో భాగంగా సోమవారం జరిగిన పోరులో ఆసీస్ 42 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 179 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. స్టొయినిస్ (35) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్కార్టీ 3, జోస్ లిటిల్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 18.1 ఓవర్లలో 137 రన్స్కు ఆలౌటైంది. లోరాన్ టకర్ (48 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, మ్యాక్స్వెల్, స్టార్క్, జంపా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫించ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.