ఓవల్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఫైనల్లో మరీ నెమ్మదిగా బౌలింగ్ చేసిన ఇండియా జట్టుకు మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేశారు. ఆస్ట్రేలియా కూడా స్లోగా ఓవర్లు వేసింది. దీంతో ఆ జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం ఫైన్ వేశారు.
ఇక రెండో ఇన్నింగ్స్లో వివాదాస్పద రీతిలో ఔటైన శుభమన్ గిల్ (Shubman Gill).. థార్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే గిల్ ప్రవర్తన సరిగా లేని కారణంగా అతనికి అదనంగా 15 శాతం ఫైన్ వేశారు. దీంతో గిల్పై మొత్తం 115 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని 2.7 రూల్ను గిల్ అతిక్రమించినట్లు ఐసీసీ తన ప్రకటనలోపేర్కొన్నది.
గిల్ ఇచ్చిన క్యాచ్ను గ్రీన్ అందుకున్నాడు. వివాదాస్పద ఆ క్యాచ్పై టీవీ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆ క్యాచ్ను క్లీన్గా అందుకున్నట్లు అంపైర్ రిచర్డ్ తీర్పునిచ్చారు. అయితే ఆ నిర్ణయంపై సోషల్ మీడియా అకౌంట్లో గిల్ కామెంట్ చేశాడు. దీంతో ఐసీసీ అతనిపై చర్య తీసుకున్నది.
నిర్దేశిత సమయంలో ఇండియా 5 ఓవర్లు తక్కువగా వేసిందని, మరో ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో చెప్పింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల 2.22 ప్రకారం ఒక ఓవర్ ఆలస్యమైతే మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వసూల్ చేస్తారు.
🚨 JUST IN: India, Australia and star opener sanctioned by the ICC.
Details ⬇️https://t.co/n1AVCUeVTm
— ICC (@ICC) June 12, 2023