Pat Cummins : ఇంగ్లండ్ గడ్డపై వారం క్రితమే యాషెస్ సిరీస్(Ashes Series) డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా (Australia)కు షాక్. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) టీమిండియా పర్యటనకు దూరం కానున్నాడు. యాషెస్ సిరీస్లో అద్భుతంగా రాణించిన కమిన్స్ ఈ సిరీస్కు అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఎడమ చేతి మణికట్టు గాయం(left wrist injury). అవును.. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో కమిన్స్ ఎడమ చేతి మణికట్టు విరిగింది. ఆ గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టనున్నందున కమిన్స్ విశ్రాంతి తీసుకుంటాడని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.
అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా(CricketAustralia) మాత్రం కమిన్స్ గాయంపై ఇప్పటివరకూ అధికారికి ప్రకటన చేయలేదు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా, ఇండియా టూర్ కోసం ఆసీస్ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఆలోపు కమిన్స్ గాయంపై స్పష్టత రావొచ్చు.
ఎడమ చేతి మణికట్టుకు పట్టీ వేసుకున్న కమిన్స్
కంగారు జట్టు సెప్టెంబర్లో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్కు రానుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా తొలి వన్డేలో ఇరుజట్లు తలపడనున్నాయి. ఒకవేళ కమిన్స్ ఆడకుంటే మిచెల్ మార్ష్(Mitchell Marsh)కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ విధ్వంసక ప్లేయర్ ఆసీస్ టీ20 కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్న విషయం తెలిసిందే.
ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా గొప్పగా రాణిస్తున్నాడు. అతడి నేతృత్వంలోని ఆసీస్ ఓవల్ స్టేడియంలో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) టీమిండియాను ఓడించింది. దాంతో, అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. మూడు ఫార్మాటల్లో చాంపియన్గా నిలిచిన కంగారు జట్టులో సభ్యుడిగా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్లోనూ కమిన్స్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టులో నాథన్ లియాన్(Nathan Lyon)తో కలిసి జట్టును గెలిపించాడు. దాంతో, ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పుంజుకున్న ఇంగ్లండ్ రెండు విజయాలతో సిరీస్ డ్రా చేసుకుంది.