Glenn McGrath : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓటమి ఆ జట్టు మాజీ కెప్టెన్లు, మాజీ క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. మూడో టెస్టుకు ముందు తమ జట్టు ఓటమిపై మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ స్పందించాడు. ‘నాలుగు టెస్టుల సిరీస్ను 4-0తో కోల్పోకుంటే చాలు.. ఆస్ట్రేలియా మెరుగ్గా ఆడినట్టే. ప్రస్తుతం జట్టు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్పై ఎక్కువగా ఆధారపడుతోంది. అలాకాకుండా మొత్తం బ్యాటింగ్ లైనప్ పోరాడాలి.
అందుకోసం వాళ్లు భారత్లో స్పిన్నర్లను ఎదుర్కోవడం గురించి ప్రణాళికతో ఉండాలి. అంతేకాదు ఆత్మవిశ్వాసంతో ఆడాలి. తొలి రెండు టెస్టుల్లో ఓటమికి కారణం.. ఆసీస్ బ్యాటర్లు తొలి టెస్టులో పూర్తిగా డిఫెన్స్ నమ్ముకున్నారు. రెండో టెస్టులో అటాకింగ్ గేమ్ ఆడాలనుకున్నారు. అందుకనే వికెట్లు సమర్పించుకున్నారు’ అని మెక్గ్రాత్ తెలిపాడు. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల వేట కొనసాగించడంతో ఆసీస్ రెండు మ్యాచుల్లో కుప్పకూలింది.
నాలుగు టెస్టుల సిరీస్లో ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఇండోర్ వేదికగా రేపు మూడో టెస్టు జరగనుంది. మూడో టెస్టులో కూడా నెగ్గితే టీమిండియా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఫైనల్కు ఆస్ట్రేలియా అర్హత సాధించింది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో జూన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. మూడేళ్ల క్రితం జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఏడు వికెట్లు తీసిన కివీస్ ఆల్రౌండర్ జేమీసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.