హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్వతంత్ర వజ్రోత్సవాల వేళ.. ప్రముఖ మారథాన్ రన్నర్ సోమ జగన్మోహన్ 75 కిలోమీటర్లు పరిగెత్తి ఆకట్టుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ రన్ను సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 75 కిలో మీటర్ల రన్నింగ్ నిర్వహించారు.
ఇందులో పలువురు అథ్లెట్లు, యువకులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. సైబరాబాద్ సీపీ ఆఫీస్ నుంచి ప్రారంభమైన ఈ పరుగు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్భవన్, కాచిగూడ రైల్వే స్టేషన్, చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, జూపార్క్, గోల్కొండ మీదుగా తిరిగి సీపీ కార్యాలయానికి చేరింది.