బెంగళూరు: రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే లేచి పది అడుగులు వేయమని చెబితే 20 కారణాలు చెప్పి బెడ్ మీద నుంచి లేవనంటున్న నేటి యువతకు మనిషికి డబ్బు, ఇతర సుఖాల కంటే ఆరోగ్యం ఎంత అవసరమో చాటి చెబుతున్నాడో వృద్ధుడు. కర్నాటకకు చెందిన ఎన్. ఎస్. దత్తాత్రేయ.. 96 ఏండ్ల వయసులోనూ దేశవిదేశాల్లో నిర్వహిస్తున్న మారథాన్, వాకథాన్లలో పాల్గొంటున్నారు. ఈ నెల 28న బెంగళూరు వేదికగా జరగాల్సి ఉన్న ‘వరల్డ్ 10కే బెంగళూరు’ లోనూ బరిలోకి దిగనున్నారు.