టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా కష్టం. అందుకే అంతర్జాతీయ టీ20లలో సెంచరీలు చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా భారత యువ ఆటగాడు దీపక్ హుడా కూడా ఈ ఎలైట్ లిస్టులో చేరాడు. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో చెలరేగిన అతను 104 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో క్రీడాలోకం అతన్ని ప్రశంసల్లో ముంచెత్తుతోంది. భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కూడా హుడాను కొనియాడాడు. ఈ 27 ఏళ్ల కుడిచేతివాటం బ్యాటర్తో తను కొన్నిరోజుల క్రితం మాట్లాడానని, ఐపీఎల్-2022లో సెంచరీ చేయాలని చెప్పానని పఠాన్ వెల్లడించాడు.
ఐపీఎల్లో చేయని సెంచరీని భారత్ తరఫున చేయడం మరింత గొప్ప విషయమని, హుడాను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని మెచ్చుకున్నాడు. ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20లలో భారత్ తరఫున సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా హుడా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు రోహిత్ శర్మ, సురేష్ రైనా, కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించారు.
Thank you so much bhaiya!! https://t.co/ndUC5uUSv0
— Deepak Hooda (@HoodaOnFire) June 29, 2022