హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో పాల్గొనే భారత 4స400 మీటర్ల రిలే జట్టుకు తెలంగాణ అథ్లెట్, ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాల స్టూడెంట్ నరిమళ్ల ప్రవల్లిక ఎంపికైంది. నల్లగొండ జిల్లా దిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక చైనాలోని ఆర్డోస్ నగరంలో జూలై 9 నుంచి జరిగే ఆసియా అండర్23 పోటీల్లో భారత్ తరఫున పోటీ పడనుంది.
ప్రవల్లిక ఐదో తరగతి నుంచే దిండి గురుకుల క్రీడా అకాడమీలో శిక్షణ పొందుతున్నది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో 35, జాతీయ స్థాయిలో 3 కాంస్య పతకాలు సాధించింది. అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైన ప్రవల్లికను తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యాయామ సంచాలకులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం చైర్మన్ రామలక్ష్మణ్, అధ్యక్షులు ఎం. నర్సయ్య అభినందించారు.