అస్తానా(కజకస్థాన్) : ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత షాట్పుటర్ తజిందర్పాల్సింగ్ తూర్ స్వర్ణం సాధించాడు. తజిందర్ 19.49మీ. దూరం షాట్పుట్ విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన కరణ్వీర్ సింగ్ 19.37మీ.తో రజతం సొంతం చేసుకున్నాడు.
ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డును మెరుగుపరుస్తూ 16.98మీ.తో రజతం దక్కించుకున్నాడు. లాంగ్జంప్లో జెస్విన్ ఆల్డ్రిన్ జాతీయ రికార్డును అధిగమించి ఫైనల్స్కు అర్హత సాధించాడు. మహిళల పెంటాథ్లాన్లో స్వప్న బర్మన్ 4119 పాయింట్లు సాధించి రజతం గెలుచుకుంది.