న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్, పాకిస్థాన్ హాకీ జట్లు ఒకే గ్రూపులో కొలువుదీరాయి. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియా గేమ్స్కు తెరలేవనుంది. పురుషుల కేటగిరీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ గ్రూపు-ఏలో బరిలోకి దిగనుండగా, మహిళల విభాగంలో హాంకాంగ్, సింగపూర్, దక్షిణకొరియా, మలేషియాతో కలిసి పూల్-ఏలో భారత్ తలపడనుంది.
సెప్టెంబర్ 24న ఆసియా పోరు మొదలుపెట్టనున్న టీమ్ఇండియా..30న దాయాది పాక్తో అమీతుమీ తేల్చుకోనుంది. గత(2018) ఆసియా క్రీడల్లో కాంస్య పతకానికి పరిమితమైన భారత్ ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అగ్రస్థానం దక్కించుకోవడం ద్వారా వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలని చూస్తున్నది. ప్రస్తుతం ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నది.