Asian Cricket Council : ఆసియా కప్ షెడ్యూల్ గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ నజం సేథీ సోషల్మీడియాలో చేసిన ఆరోపణలను ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఖండించింది. ఆయన వార్తల్లో నిజం లేదని శుక్రవారం ఏసీసీ వెల్లడించింది. ఏసీసీ అధ్యక్షుడు జై షా 2023-24 క్యాలెండర్ తయారీలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ నజం సేథీ ఆన్లైన్లో పోస్టులు పెట్టారు. దాంతో, అవన్నీ తప్పుడు కథనాలని ఏసీసీ వివరణ ఇచ్చింది. ‘డెవలప్మెంట్ కమిటీ, మార్కెటింగ్ కమిటీలుపోయిన ఏడాది డిసెంబర్ 13న ఆసియాకప్ క్యాలెండర్కు అమోదం తెలిపాయి. డిసెంబర్ 22న ఆసియా కప్ ఆడే జట్ల బోర్డులను సంప్రదించామని, అయితే.. క్యాలండర్లో చేయాల్సిన మార్పుల గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి సలహాలుగానీ, అభ్యంతరాలుగానీ వెల్లడించలేదు’ అని ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
జై షా గురువారం ఏసీసీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. దాంతో, పీసీబీ ఛైర్మన్ నజం సేథీ, జై షాపై విమర్శలు చేశారు. ‘2023-24 ఏసీసీ క్యాలెండర్ను ఏకపక్షంగా ఆవిష్కరించినందుకు జై షా నీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న2023 ఆసియా కప్కు సంబంధించి కూడా నువ్వే నిర్ణయం తీసుకున్నావు. అలానే పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 షెడ్యూల్ కూడా విడుదల చేయండి’ అంటూ పీసీబీ ఛైర్మన్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఆ ట్వీట్కు జై షాను ట్యాగ్ చేశాడు. జై షా బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ ఈమధ్యే పీసీబీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు.
Thank you @JayShah for unilaterally presenting @ACCMedia1 structure & calendars 2023-24 especially relating to Asia Cup 2023 for which 🇵🇰 is the event host. While you are at it, you might as well present structure & calendar of our PSL 2023! A swift response will be appreciated. https://t.co/UdW2GekAfR
— Najam Sethi (@najamsethi) January 5, 2023