చెన్నై: వరుస విజయాలతో జోరుమీదున్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో శుక్రవారం జపాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. చివరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయంతో ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా.. జపాన్తో పోరులో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది.
రౌండ్ రాబిన్ లీగ్లో పరాజయం ఎరగకుండా నాలుగు మ్యాచ్ల్లో నెగ్గి ఓ మ్యాచ్ ‘డ్రా’ చేసుకున్న భారత్ 13 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్తో సెమీస్కు చేరింది. లీగ్ దశలో భారత్ ‘డ్రా’ చేసుకున్న ఏకైక మ్యాచ్ జపాన్తోనే కాగా.. ఈ సారి ఫలితం మార్చాలని హర్మన్ప్రీత్ సింగ్ సేన భావిస్తున్నది. మరో సెమీస్లో మలేషియాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా తలపడనుంది.