ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు రెండు రజతాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకున్న భారత్ ఓవరాల్గా 7 పతకాల (ఒక స్వర్ణం, 4 రజతాలు, 2 కాంస్యాలు)తో మెగాటోర్నీని ముగించింది. శుక్రవారం ఆఖరి రోజు కొరియా అడ్డంకిని దాటలేకపోయిన భారత ఆర్చర్లు పురుషుల రికర్వ్ విభాగంతో పాటు టీమ్ ఈవెంట్ ఫైనల్స్లో ఓడి రెండు రజతాలు కైవసం చేసుకున్నారు. రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పోరులో భారత్ 6-0తో ఉజ్బెకిస్థాన్పై విజయం సాధించింది.