ముంబై: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఆసియాకప్ జరుగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాము టోర్నీ నిర్వహించలేమంటూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది.
దీంతో వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. వచ్చే నెల 27 నుంచి సెప్టెంబర్ 11వరకు యూఏఈలో ఆసియాకప్ జరుగుతుందని తెలిపాడు. వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ యూఏఈ అయితే సరిపోతుందని దాదా చెప్పుకొచ్చాడు.