భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ నుంచి తను అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇదివరకే చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆసియా కప్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దీనిలో కోహ్లీతోపాటు కరోనా నుంచి కోలుకున్న రాహుల్కు కూడా చోటు కల్పించింది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఇద్దరూ గాయాలతో ఈ టోర్నీకి దూరమైనట్లు ప్రకటించింది. ఈ మెగాటోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆగస్టు 28న తొలి మ్యాచ్ ఆడనుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్
స్టాండ్ బై: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్
🚨#TeamIndia squad for Asia Cup 2022 – Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.
— BCCI (@BCCI) August 8, 2022