దుబాయ్: ఆసియా కప్లో భాగంగా భారత్తో ఇటీవల ముగిసిన సూపర్-4 మ్యాచ్లో అభ్యంతరకర హావభావాలతో టీమ్ఇండియా అభిమానులను రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించిన పాకిస్థాన్ క్రికెటర్లు హరీస్ రౌఫ్, ఫర్హాన్పై ఐసీసీ చర్యలకు దిగింది. రౌఫ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించగా ఫర్హాన్ను మందలించి మళ్లీ ఇలాంటివి చేయరాదని వార్నింగ్ ఇచ్చింది.
బీసీసీఐ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచి రిచర్డ్సన్ ఎదుట విచారణకు హాజరైన రౌఫ్.. మ్యా చ్లో తాను చేసిన సంజ్ఞ (ఆపరేషన్ సిం ధూర్లో పాక్ సైన్యం భారత్కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చిందనేదానిని ప్రతిబింబించేలా చేతి వేళ్లతో ఆరు అని చూపించడం)లు భారత్ను ఉద్దేశించినవికావని విచారణలో చెప్పినట్టు తెలిసింది.
గ్రూప్ దశలో పాకిస్థాన్తో మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. అయితే ఐసీసీ తీర్పుపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీకి అప్పీల్ చేసినట్టు సమాచారం.