కొలంబో: భారత్-పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ‘ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC)’ శుభవార్త చెప్పింది. ఆసియా కప్-2023లో భాగంగా ఈ నెల 10న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు వర్షంవల్ల అంతరాయం కలిగితే.. ఆ మ్యాచ్ను మరుసటి రోజైన సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్లు ACC ప్రకటించింది. ఆ మేరకు సెప్టెంబర్ 11ను దాయాదుల మధ్య మ్యాచ్కు రిజర్వ్ డే ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
ఆసియాక్ప్ సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు సెప్టెంబర్ 10న తలపడనున్నాయి. శ్రీలంక రాజధాని కొలంలోని ఆర్ ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. అయితే కొలంబోలో సెప్టెంబర్ 10న వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న మ్యాచ్ సాధ్యం కాకపోతే, సెప్టెంబర్ 11న నిర్వహించేందుకు ACC ఆ రోజును రిజర్వ్ డేగా ప్రకటించింది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న రెండు దేశాల అభిమానులకు గ్రూప్ స్థాయిలో కూడా నిరాశే ఎదురైంది. ఇరుజట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ స్థాయి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత వర్షం రావడంతో పాకిస్తాన్ జట్టు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే మ్యాచ్ రద్దయ్యింది.