గువాహటి: భారత మహిళల డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టొ గువాహటి మాస్టర్స్ సూపర్100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్లో టైటిల్ పోరుకు చేరుకున్నారు. గత వారం ముగిసిన సయ్యద్ మోడి స్మారక టోర్నీలో రన్నర్స్గా నిలిచిన ఈ జోడి ఇక్కడ మూడో సీడ్ నెదర్లాండ్స్కు చెందిన డెబొర జిల్, చెరిల్ సీనెన్లపై 36 నిమిషాలలో 21-12, 21-12 స్కోరుతో గెలుపొందారు. ఫైనల్లో భారత జోడి తైవాన్కు చెందిన సంగ్ షో యున్-యు చీన్ హుయితో ఆదివారం తలపడతారు. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, మిక్స్డ్ డబుల్స్లో తనీషా-ధ్రువ కపిల ఫైనల్స్కు చేరుకోవడంలో విఫలమయ్యారు.