Ravichandran Ashwin : భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin ) రాజ్కోట్ టెస్టులో ఐదొందల వికెట్ల క్లబ్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాంతో, ఈ ఘనత సాధించిన రెండో భారత స్పిన్నర్గా, తొమ్మిదో బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఈ స్పిన్ మాంత్రికుడి రికార్డు వికెట్ తీయడంపై భార్య ప్రీతి(Prithi) ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. అందులో 500.. 501వ వికెట్ మధ్య ఎంతో జరిగిందని ఆమె తెలిపింది.
‘ఉప్పల్ టెస్టులోనే అశ్విన్ 500 వికెట్ తీస్తాడని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ తర్వాత వైజాగ్ టెస్టులోనూ అది సాధ్యపడలేదు. దాంతో, 499వ వికెట్ సమయంలో తెచ్చిన స్వీట్లను అందరికీ పంచేశాం. 500వ వికెట్ అనేది అలా వచ్చేసింది. 500 నుంచి 501 వికెట్.. ఈ రెండిటి మధ్య సుదీర్ఘమైన 48 గంటలు ఉన్నాయి. 500 వికెట్లు తీయడమనేది చాలా గొప్ప విషయం. అశ్విన్ ఒక అద్భతమైన వ్యక్తి. అతడిని చూసి నేనెంతో గర్వపడుతున్నా’ అని ప్రీతి రాసుకొచ్చింది.
ఇంగ్లండ్ పర్యటన ఖరారు కాగానే యావత్ భారత అభిమానులంతా అశ్విన్ 500వ వికెట్ ఎప్పుడెప్పుడు తీస్తాడని ఆతృతగా ఎదురుచూశారు. అందరూ ఊహించినట్టుగానే రాజ్కోట్ టెస్టుల్ యశ్.. తన ఆ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేసి దిగ్గజాల సరసన చేరాడు. 500 వికెట్ తీసిన ఆనందంలో ఉండగానే తల్లి చిత్ర(Chitra)కి ఆరోగ్యం బాగాలేదని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది.
అశ్విన్, అనిల్ కుంబ్లే