క్రికెట్లో ‘మన్కడింగ్’ అనే అవుట్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ప్రస్తుతం అయితే క్రికెట్ అభిమానులందరికీ మన్కడింగ్ గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 2019 ఐపీఎల్ సమయంలో ఇంగ్లీష్ ఆటగాడు జోస్ బట్లర్.. మంచి ఫామ్లో ఉన్నాడు. ఆ సీజన్లో పంజాబ్ తరఫున అశ్విన్ ఆడుతున్నాడు.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బట్లర్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో విరుచుకుపడి రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించేలా కనిపించాడు. ఆ సమయంలో బౌలింగ్కు వచ్చిన అశ్విన్.. బౌలింగ్ చేసే సమయంలో నాక్ స్ట్రైకర్ క్రీజు దాటిన బట్లర్ను చూసి అదే ఎండ్లో వికెట్లను పడగొట్టాడు. అంపైర్కు అప్పీలు చేయగా అవుట్ అని తేలింది. దీన్నే మన్కడింగ్ అంటారు.
ఈ ఘటన తర్వాత క్రికెట్ ప్రపంచం మొత్తం రెండుగా విడిపోయింది. కొందరు అశ్విన్కు సపోర్ట్ చేయగా.. మరికొందరు దీన్ని తప్పుబట్టారు. క్రికెట్ క్రీడకు సంబంధించి నియమనిబంధనలు అమలు చేసే మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) పుస్తకాల్లో.. మన్కడింగ్ 41వ చట్టం కింద ఉండేది. ఈ చట్టం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన అంశాలను చర్చిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మార్చి మన్కడింగ్ను రనౌట్ల సెక్షన్ అయిన 38లో చేర్చింది.
ఈ విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘‘కంగ్రాచ్యులేషన్స్ అశ్విన్, ఈ వారం నీకు అద్భుతంగా గడిచింది. అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్గా కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టావు. ఇప్పుడు ఇది. ఇక బట్లర్తో ఇలాంటి రనౌట్లను ప్లాన్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ దొరికింది. మర్చిపోకుండా ఒకసారి ఇది చెయ్యి’’ అని చెప్పాడు.
అయితే ఈ ఐపీఎల్లో అశ్విన్, బట్లర్ ఇద్దరూ రాజస్థాన్ జట్టుకే ఆడుతున్నారు. కాబట్టి బట్లర్ను అశ్విన్ మన్కడింగ్ చేయలేడు. కానీ ఈ రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి అంతర్జాతీయ టోర్నీ టీ20 ప్రపంచకప్లో అశ్విన్.. దీన్ని ఉఫయోగించే అవకాశం ఉంది.
Congratulations @ashwinravi99, great week this one. First becoming second highest wicket taker in Tests for India, and now this. Ab full freedom to plot such run-outs with Buttler.
Ek karna zaroor 😊 https://t.co/oCjfYdr6nr— Virender Sehwag (@virendersehwag) March 9, 2022