హైదరాబాద్, ఆట ప్రతినిధి: దోహా(ఖతార్) వేదికగా ఈ నెల 17 నుంచి మొదలవుతున్న ఎఫ్ఐబీఏ ఆసియాకప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన ఆర్యన్శర్మ ఎంపికయ్యాడు. మంగళవారం ఎంపిక చేసిన భారత బాస్కెట్బాల్ జట్టులో ఆర్యన్ చోటు దక్కించుకున్నాడు. టర్కీలో వచ్చే ఏడాది జరిగే ఎఫ్ఐబీఏ అండర్-17 ప్రపంచటోర్నీకి ఇది అర్హత చాంపియన్గా పరిగణిస్తున్నారు.
గత ఆగస్టులో ఫిబా ఆసియాకప్ క్వాలిఫయర్ టోర్నీ లో భారత జట్టుకు ఈ యువ ప్లేయర్ ప్రాతినిధ్యం వహించాడు. నగరంలోని కీస్టోన్ బాస్కెట్బాల్ అకాడమీలో ప్రస్తుతం పీఎస్ సంతోష్ దగ్గర ఆర్యన్ శిక్షణ తీసుకుంటున్నాడు.