హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఏఐ) ప్రధాన కార్యదర్శిగా అర్సనపల్లి జగన్మోహన్రావు ఎంపికయ్యారు. జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్యపై ఏడాదికి పైగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరతీసిన జగన్మోహన్రావు..ఆసియా, అంతర్జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్యల, జాతీయ ఒలింపిక్ సంఘం(ఐవోఏ), క్రీడామంత్రిత్వ శాఖను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.
ఇటీవల జైపూర్లో జరిగిన హెచ్ఏఐ ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీగా జగన్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దిగ్విజయ్సింగ్ చౌతాలా(హర్యానా) అధ్యక్షుడిగా, ఖుష్బుచౌదరి(ఢిల్లీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఐవోఏ మాజీ కోశాధికారి ఆనందీశ్వర్పాండే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.