వంటా (ఫిన్లాండ్) : ఆర్కిటిక్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీస్ పోరులో చైనాకు చెందిన జీ యీ వాంగ్ చేతిలో ఓటమి పాలైంది. తొలిగేమ్ను 12-21తో చేజార్చుకున్న సింధు ఆ తర్వాత పుంజుకొని 21-11తో రెండో గేమ్ కైవసం చేసుకుంది.
అయితే.. నిర్ణయాత్మకమైన మూడో గేమ్లో వాంగ్ జోరు ముందు నిలబడలేక 7-21తో వెనకబడింది. ఈ ఏడాది మొదటి సారి క్వార్టర్స్ గండం దాటి ఆశలు రేపిన సింధు.. మరోసారి టైటిల్కు రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది.