హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్తో పాటు బధిర ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన షేక్ జాఫ్రిన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి అభినందించారు.
శుక్రవారం సచివాలయంలో శ్రీకాంత్, జాఫ్రిన్కు జ్ఞాపికలు అందించి శాలువాలతో సన్మానించారు. అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం గర్వకారణమన్నారు. అర్హత ఆధారంగా జాఫ్రిన్కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నగదు ప్రోత్సాహకం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.