బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ మరో పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ చేతిలో 36-31తో తెలుగు జట్టు ఓడిపోయింది. అంకిత్ (7), ఆకాశ్ చౌదరి (5), రాకేశ్ గౌడ (5) శ్రమించినా జట్టు పరాజయం పాలైంది. మరో పోరులో హర్యానా స్టీలర్స్ 36-35తో యూపీ యోధపై ఉత్కంఠ విజయం సాధించింది.